News

Home News

అనకాపల్లి జిల్లా

సార్వత్రిక సమ్మె కు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

సార్వత్రిక సమ్మె కు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

అనకాపల్లి: కేంద్ర కార్మిక సంఘాలుదేశవ్యాప్తంగా జూలై 9న ఇచ్చిన సమ్మె పిలుపునకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యూజెఎఫ్) సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు భీమరశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లిలో సీఐటీయూ తో కలిసి జర్నలిస్టులు బుధవారం ఆర్.డి.వో. కార్యాలయం వద్ద
ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలు కూడా ఇమిడి వున్నందున తాము కూడా అందులో భాగస్వాములమవుతున్నామని ప్రకటించారు. రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించే దిశగా ట్రేడ్ యూనియన్ లు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి జర్నలిస్టుల మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శశి, కార్యదర్శి పి.నాగ, ఏపీబీజెయు చాంద్ బాషా, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్,  సీనియర్ జర్నలిస్టులు కాండ్రేగుల మోహన్, బి. కొండలరావు, గంగాధర్, జగన్, కుమార్, రామకృష్ణ, గోపాల్, అప్పారావు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా

రద్దుచేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను పునరుద్ధరించాలి
* కార్మికుల సార్వత్రిక సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం...

రద్దుచేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను పునరుద్ధరించాలి
_______----------

* కార్మికుల సార్వత్రిక
సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

చిత్తూరు : దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని ఎపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజ్ తెలిపారు. బుధవారం ఉదయం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కార్మికుల నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీంభాషా, జర్నలిస్టులు పాల్గొన్నారు. సదుం మండల కేంద్రంలో ఎపిడబ్ల్యుజేఎఫ్ నేతలు తాహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను నిలబెట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ 2020 ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కేంద్రం అందిస్తున్న రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించి జర్నలిస్టులు భాగస్వాములయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలతో పాటు జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. చిత్తూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, కోశాధికారి నాగరాజు, సహాయ కార్యదర్శి ఉమాశంకర్, ఉపాధ్యక్షుడు మురళికృష్ణ, సంయుక్త కార్యదర్శి విజయ్. కుబేంద్రన్, జర్నలిస్ట్ నేతలు దామోదర్, జ్ఞాన ప్రకాష్, సత్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఏలూరు జిల్లా

చిత్తూరు జి కార్మికుల సంఘాలకు మద్దతుగా నిరసన తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్ కామ్రేడ్స్..

కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్మికులకు మద్దతుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మద్దతు పలకటం జరిగినది కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి ఏపీడబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగినది ఈ చట్టాలను పునరుద్దించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేయటానికి ఈ నిరసన వ్యక్తం చేసాము అన్ని సంఘాల తో పాటుగా మీడియా కూడా పాల్గొనడం జరిగినది కార్మిక సంఘాల అందరు మద్దతు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో పట్టణ డివిజన్ అధ్యక్షులు పి ఎన్ వి రామారావు చింతలపూడి నియోజకవర్గ కార్యదర్శి గొల్లమందల శ్రీనివాసరావు సంఘ సభ్యులు ఉప్పల కృష్ణ కలపాల శ్రీనివాసరావు కె రవి కిరణ్ జుజ్జువరపు శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కే శంకర్రావు జిల్లా కేంద్రమైన ఏలూరులో కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలు పాల్గొనడం జరిగినది

విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లాలో జర్నలిస్టులు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ.
కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్.

విశాఖ జిల్లాలో జర్నలిస్టులు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ.

కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్.

త్వరలోనే జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు.

విశాఖపట్నం..
ఆంధ్రప్రదేశ్. వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్,స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంఘం నేతలు అంతా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ
జి శ్రీనివాసరావు. బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు. ఈశ్వరరావు మదన్.,చిన్న మధ్య తరహా పత్రిక ల సంఘం అధ్యక్షులు జగన్మోహన్,, కార్యదర్శి కె., శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ కలెక్టర్ ను కలిసిన అనంతరం జర్నలిస్ట్ స్కూల్ ఫీజు రాయతీ 50%ఇవ్వడం జరిగింది అని త్వరలో జర్నలిస్ట్ లకు ఉచితముగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని కలక్టర్ చెప్పారన్నారు.... ఈ సందర్బంగా ఫీజు రాయతీ ఉత్తర్వులు కాఫీ అందరు వినియోగించుకోవాలి అని వీరు పేర్కొన్నారు.. జర్నలిస్ట్ ల సంక్షేమం తమ లక్ష్యమని గంట్ల

కాకినాడ జిల్లా

ఇది ఒక రికార్డ్
మండలంలో ఉన్న మొత్తం విలేకరులు మన ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు.

మండలంలో ఉన్న మొత్తం విలేకరులు మన ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు.

ఇది ఒక రికార్డ్

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలో మండల APWJF సభ్యత్వ నమోదు కార్యక్రమం సురక్ష ప్యాలస్ లో శనివారం APWJF సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జన స్పందన విలేఖరిగా పనిచేస్తున్న మామిడాల చక్రధర్ రావు ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు ఫెడరేషన్ అందించిన రూ.5000 చెక్కును సభ్యుల ద్వారా అందించడం జరిగింది.


ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 22 మంది సభ్యత్వాలను నమోదు చేయించుకున్నారు.

ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సత్య హాజరయ్యారు.

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs